Breaking News

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ‘సమత’ హత్యాచారం నిందితులు.. ఉరి తీయాలంటూ డిమాండ్


తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ‘సమత’ హత్యాచారం కేసులో విచారణ సోమవారం ప్రారంభమైంది. ముగ్గురు నిందితులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో నేటి నుంచి విచారణ సందర్భంగా ఐదు రోజుల పాటు కోర్టు సాక్షులను విచారించనుంది. దీని నిమిత్తం అసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి 44 మంది సాక్షులతో కూడి ఛార్జిషీటును శనివారమే దాఖలు చేశారు. Also Read: చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమ్రుంభీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో సామూహిక అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసిన చంపేసిన షేక్‌బాబు, షేక్ శాబొద్దీన్, షేక్ ముఖ్దూమ్‌‌ను పోలీసులు నవంబర్ 27న అరెస్ట్ చేశారు. Also Read: బాధితురాలు దళితురాలు కావడంతో అత్యాచారం, హత్యతో పాటు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ వివరాలు గోప్యంగా ఉంచే పేరుతో పోలీసులు ఆమె పేరును ‘సమత’గా మార్చారు. ఆమెను పాశవికంగా అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు కత్తితో గొంతుకోసి చంపేశారని పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు. Also Read: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ ఘటనకు మూడురోజల ముందే ఈ దారుణం జరిగింది. ఈ కేసుకు మొదట్లో అంత ప్రాధాన్యత దక్కలేదు. అయితే ‘దిశ’ ఘటనతో ప్రజలు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసింది. దీంతో నిందితులు షేక్‌బాబా(ఏ1), షేక్‌ షాబొద్దీన్‌(ఏ2), షేక్‌ ముఖ్దూమ్‌(ఏ3)ను పోలీసులు కోర్టులో హజరుపరిచారు. కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టదిట్టమైన భద్రత కల్పించారు. మరోవైపు నిందితులపై త్వరగా విచారణ పూర్తిచేసి ఉరి తీయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By December 16, 2019 at 01:49PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-produce-samatha-gang-rape-accused-in-fast-track-court/articleshow/72744731.cms

No comments