Breaking News

పాకిస్తాన్ ప్రేమికులు.. భారత ప్రియురాళ్లు!


నుంచి హైదరాబాద్ మహా నగరానికి అనేక మంది వస్తుంటారు. కొందరు విద్య, వైద్య అవసరాల కోసం వచ్చే వారైతే, మరికొందరు ఉగ్రవాదం, ఐఎస్‌ఐ కార్యకలాపాల కోసం చొరబడే వారుంటారు. కానీ ఓ ఇద్దరు మాత్రం పక్షులుగా మారి అడ్డదారిలో భారత్‌లోకి ప్రవేశించారు. వీరిలో ఒకడు అరాచకాలకు పాల్పడుతూ.. మరొకరు ప్రియురాలిని తీసుకుని దొడ్డిదారిలో పాకిస్తాన్‌కు చెక్కేసేందుకు పన్నాగం పన్నగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరిలో ఒకరు గతేడాది పాతబస్తీలో పట్టుబడిన ఇక్రమ్‌కాగా, మరొకరు ఈ నెల మొదటి వారంలో సికింద్రాబాద్‌లో చిక్కిన గుల్జార్‌. ఈ రెండు కేసుల్లో ఒకరు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్ద ఉండగా, మరొకరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ఇద్దరు పాకిస్థానీయులు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. Also Read: పాతబస్తీకి వచ్చి, అరాచకాలు..హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఇద్దరు బిడ్డల తల్లి అయిన మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. పన్నెండేళ్ల క్రితం ఆమె బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న మహిళకు పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తాను భారతీయుడినేనని, తన స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసి ఆమె హైదరాబాద్‌ తిరిగి వచ్చేసింది. అయితే 2011లో ఉస్మాన్‌ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్‌ వీసాపై వచ్చినట్లు చెప్పాడు. కానీ, వాస్తవానికి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన అతడు దుబాయ్‌ నుంచి నేపాల్‌ వరకు విమానంలో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఇక్రమ్‌ వచ్చిన 6 నెలలకు తర్వాత దేశంలోకి అక్రమంగా చొరబడ్డాడన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించింది. దీంతో కక్షకట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే కూతురి నగ్న ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్‌ చేశాడు. అతడి వేధింపులు భరించలేక బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు గతేడాది జూన్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. Also Read: మిస్డ్ కాల్ ప్రేమ..పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావెన్సీ, కుల్వాల్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ గుల్జార్‌ ఖాన్‌ 2004లో దుబాయ్‌లో నివసించేవాడు. అప్పట్లో పొరపాటుగా వచ్చిన మిస్డ్‌ కాల్‌కు స్పందించి ఫోన్‌ చేశాడు. ఆ కాల్‌ను కర్నూలు జిల్లా గడివేములకు చెందిన దౌతల్‌ బీ అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన దౌతల్‌కు భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న గుల్జార్.. భారత్‌కు వచ్చేందుకుగాను 2008లో సౌదీ వెళ్లాడు. అక్కడ తన పాకిస్థానీ గుర్తింపులను ధ్వంసం చేసి భారత ఎంబసీని ఆశ్రయించాడు. తాను హరిద్వార్‌ నుంచి హజ్‌ యాత్ర కోసం వచ్చానని, తన పాస్‌పోర్ట్‌ సహా ఇతర పత్రాలన్నీ పోయాయని ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమెర్జెన్సీ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకు పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన గుల్జార్.. దౌతల్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు. ఆమెను కలుసుకున్న గుల్జార్‌ వివాహం చేసుకోవడంతో పాటు అక్కడే పెయింటర్‌గా స్థిరపడ్డాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అతగాడు కుటుంబాన్ని తీసుకుని పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను విజయవాడ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి పాస్‌పోర్ట్స్‌ పొందినా.. సోదరుడి సలహా మేరకు కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా అడ్డదారిలో వెళ్లాలని భావించాడు. ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్‌ చేరుకునేందుకు కర్నూలు నుంచి రైలులో ఈ నెల 3న హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటికే ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ ఆధీనంలోని సిట్‌ బృందం.. నిందితుడిని సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్‌ వద్ద పట్టుకుంది. Also Read:


By December 16, 2019 at 02:29PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pakistan-citizens-held-they-entered-in-india-for-love/articleshow/72747313.cms

No comments