Breaking News

హైదరాబాద్‌లో సెల్ఫీ తెచ్చిన తంట.. పార్కులో యువతీయువకుల ఘర్షణ


ఈ మధ్యకాలంలో యువతలో బాగా సెల్ఫీలకు అలవాటు పడిపోయింది. ఎక్కడికెళ్లినా సెల్ఫీలు తీసుకోవడం, సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది. ఇదే మోజుతో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సెల్ఫీ కారణంగా తలెత్తిన వివాదంతో హైదరాబాద్‌లో యువతీ యువకుల ఘర్షణకు దారితీసింది. సెల్ఫీ దిగుదామని అబ్బాయిలు కోరగా అమ్మాయిలు నిరాకరించడంతో వివాదం తలెత్తింది. Also Read: బాగ్‌లింగంపల్లిలోని పార్కుకు ఆదివారం సాయంత్రం నల్లకుంట ప్రాంతానికి ఓ ఇంటర్ విద్యార్థిని, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక కలిసి వచ్చారు. వారిద్దరూ సరదాగా ఆడుకుంటున్న సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక స్నేహితులు వారితో మాటలు కలిపారు. ఈ క్రమంలోనే వారు ఇంటర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి సెల్ఫీ దిగాలంటూ వేధించారు. దీంతో బాలికలు వారితో ఘర్షణ పడ్డారు. Also Read: ఈ ఘటనను చూసి ప్రకాశ్ అనే వ్యక్తి ఆ యువతి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయిని ఎవరో వేధిస్తున్నారంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆయన కొందరిని వెంటబెట్టుకుని పార్కుకి వచ్చి అబ్బాయిలను చితకబాదాడు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సాయంత్రం వేళ పార్కులో సరదాగా గడుపుదామని వచ్చిన వారంతా ఈ ఘటన చూసి షాకయ్యారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే దీనిపై కేసు పెట్టేందుకు యువతి తండ్రి నిరాకరించారు. పార్కులో గలాటా చేసిన ఘటనపై మాత్రం పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By December 09, 2019 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/selfie-controversy-boys-and-girls-clashed-in-public-park-in-hyderabad/articleshow/72432948.cms

No comments