కత్తులతో నరికి.. హైదరాబాద్లో నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణహత్య

హైదరాబాద్ నగరంలో మళ్లీ అలజడి చెలరేగింది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎన్బీటీనగర్లో గురువారం రాత్రి ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. మనీ వ్యవహారంలో నలుగురు యువకులు ఎన్బీటీనగర్ ఆటోస్టాండ్ సమీపంలో నడిరోడ్డుపైనే అతడిని దారుణంగా హత్య చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. Also Read: బంజారాహిల్స్లోని సయ్యద్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ బాయ్(40)పై రౌడీషీట్ ఉంది. అతడిపై చాలా కేసులు నమోదై ఉన్నాయి. కొద్ది రోజులుగా ఆటో డ్రైవర్ రజాక్(32)ను ఆటో ఫైనాన్స్కు సంబంధించిన వడ్డీ డబ్బులు రూ. 50 వేలు ఇవ్వాల్సిందిగా సయ్యద్ వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఆటోస్టాండ్ వద్ద ఉన్న రజాక్ను పక్కనే ఉన్న ఖాళీ స్థలం వద్దకు సయ్యద్ తీసుకెళ్లాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రజాక్పై అతడు చేయిచేసుకున్నాడు. దీన్ని అవమానంగా భావించిన రజాక్ తన స్నేహితుడు సలీమ్కు ఫోన్ చేసి బాధపడ్డాడు. Also Read: దీంతో కాసేపటికే సలీమ్తో పాటు సయ్యద్ వజాహిత్ కత్తులతో అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలం వద్ద శశి (20) అనే మరో స్నేహితుడు వారితో జత కలిశాడు. ఈ క్రమంలోనే సయ్యద్ బాయ్ గురువారం రాత్రి 8.45 గంటల సమయంలో ఎన్బీటీ నగర్ ఆటో అడ్డా మీదుగా బైక్పై వెళ్తున్నాడు. అతడిని రోడ్డుపైనే అడ్డగించిన నలుగురు స్నేహితులు సయ్యద్పై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే చనిపోవడంతో నిందితులు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. Also Read: ఎన్బీటీనగర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వెస్ట్జోన్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ కళింగరావు, ఎస్సైలు శ్రీనివాస్, దాలినాయుడు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. హత్యకు డబ్బుల వ్యవహారమేనా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం, ఆయుధ చట్టం సహా మూడు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read:
By December 13, 2019 at 08:42AM
No comments