అనుమానంతో పైశాచికం .. భార్య గొంతు కోసి, వీపుపై పొడిచి

అదనపు కట్నం తీసుకురాలేదన్న కోపంతో పాటు, భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోసి, వీపుపై పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా పెద్దమండ్యం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది Also Read: పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన సయ్యద్ హుస్సేన్వల్లికి గుర్రంకొండకు చెందిన సయ్యద్ సల్మా(24)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆలియా(5), ఇలాహి(4) సంతానం. గతంలో బెంగళూరులో ఎలక్ట్రిషన్గా పనిచేసిన హుస్సేన్వల్లి ఏడాది క్రితం మదనపల్లెకు వచ్చి ఈశ్వరమ్మకాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నాడు. అయితే ఇటీవల హుస్సేన్వల్లి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధిస్తున్నాడు. Also Read: దీనిపై సల్మా మూడు రోజుల క్రితం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరుసటి రోజే మరోసారి గొడవ జరగడంతో పెద్దమనుషులు వలీని హెచ్చరించి పంపారు. శుక్రవారం భార్యతో గొడవపడిన వల్లీ కత్తితో ఆమె గొంతు కోసి, వీపుపై విచక్షణా రహితంగా పొడిచాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వలీని పట్టుకుని చితకబాదారు. సల్మాని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు బెంగళూరు తరలించారు. Also Read:
By December 08, 2019 at 09:57AM
No comments