Breaking News

అమెరికాలో చదువుకుని హైదరాబాద్‌లో ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్


ఉన్నత చదువులు చదివినా జీవితంలో స్థిరపడలేనేమోనన్న ఆందోళనతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్ నం.10కి చెందిన అమల(25) అనే యువతి ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చదువు పూర్తి చేసుకుని ఇటీవలే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. శనివారం మధ్యాహ్నం తనకు ఆకలి వేయడం లేదంటూ తల్లికి చెప్పి భోజనం చేయకుండా తన గదికి వెళ్లి తలుపు వేసుకుంది. Also Read: సాయంత్రమైనా అమల బయటకు రాకపోవడంతో ఆమె తల్లి తలుపుతట్టింది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో తల్లి కిటికీలో నుంచి చూడగా అమల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె భర్తకు సమాచారమిచ్చింది. తల్లిదండ్రులు వెంటనే తలుపులు పగులగొట్టి అమలను కిందికి చూడగా అప్పటికే చనిపోయింది. దీంతో వారు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: జూబ్లీహిల్స్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ‘అమెరికాలో ఉన్నత చదువులు చదివినా జీవితంలో స్థిరపడలేకపోయా, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ అమల రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:


By December 09, 2019 at 12:48PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-woman-commits-suicide-police-recovered-note-on-the-spot/articleshow/72435813.cms

No comments