Breaking News

కర్ణాటక ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు.. 10 చోట్ల దూసుకెళుతోన్న బీజేపీ


కర్ణాటకలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 15 స్థానాలకు గానూ అధికార 10 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండు, జేడీఎస్‌ రెండు చోట్ల, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. కే.ఆర్‌.పేటలో జేడీఎస్‌, హుస్నూర్, శివాజీనగర్‌‌లో కాంగ్రెస్‌.. మహాలక్ష్మీ లేఅవుట్, కాగ్వాడ్, హన్సూర్, ఎల్లాపూర్‌, చిక్‌బళ్లాపూర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. హోస్‌కోట్‌లో స్వతంత్ర అభ్యర్థి శరత్ బచీచ్ గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. డిసెంబరు 5న జరిగిన పోలింగ్‌లో 37.75 లక్షల మంది ఓటర్లకు గానూ 70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 17 మంది రెబల్స్‌పై నాటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడంతో ఉప-ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి పరోక్షంగా బీజేపీకి సహకరించిన రెబల్స్ ప్రస్తుతం ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేశారు. మొత్తం 225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో సభ్యుల సంఖ్య 208కి చేరింది. దీంతో 105 స్థానాలున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే ఆ పార్టీ కనీసం 7 స్థానాల్లో తప్పక విజయం సాధించాలి. తాజాగా ఫలితాల సరళిని బట్టి చూస్తే బీజేపీ పది వరకు స్థానాలను తన ఖాతాలో వేసుకోనుంది. దీంతో యడ్డియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధించనుంది.


By December 09, 2019 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/counting-under-way-in-karnataka-by-polls-bjp-takes-lead-in-early-trends/articleshow/72433286.cms

No comments