హైదరాబాద్లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. రంగారెడ్డి జిల్లా మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక ఆదివారం ఇంటి బయట ఆడుకుంటోంది. చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: చిన్నారి ఏడుపు వినిపించడంతో కంగారుపడి తల్లి వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి స్థానికుల సాయంతో పాప కోసం గాలించింది. ఓ చోట యువకుడి చేతిలో చిన్నారి కనిపించడంతో గ్రామస్థులంతా ఆగ్రహంతో అతడిని చితకబాదారు. బాలికను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు చెప్పారు. Also Read: దీంతో ఆదివారం రాత్రి చిన్నారి తల్లిదండ్రులు మహేశ్వరం సీఐ వెంకన్న నాయక్కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన పోరండ్ల గ్రామస్థులు తమ ఆడబిడ్డలను బయటకు పంపాలంటేనే వణికిపోతున్నారు. Also Read:
By November 19, 2019 at 10:29AM
No comments