Breaking News

Hyderabad: ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల ఆరా


మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహేశ్‌రెడ్డి(27) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం తుఫాన్‌పల్లి గ్రామానికి చెందిన మహేశ్‌రెడ్డి ఏఎస్‌రావు నగర్‌లోని బ్యాంకులో సేల్స్ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నాగారంలోని ఎస్వీ నగర్‌లో నివాసముంటున్నాడు. Also Read: బుధవారం ఉదయం కాప్రా మండల పరిధిలోని బ్యాంక్ కాలనీలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో మహేశ్‌రెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం మృతదేహం చెట్టుకు వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో ఉన్న టీఎస్08 ఈఆర్ 8369 నంబర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. Also Read:


By October 02, 2019 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/icici-bank-employee-commits-suicide-in-hyderabad-outskirts/articleshow/71404666.cms

No comments