Breaking News

తల్లిని తిడుతోందని భార్య ప్రాణం తీసిన భర్త


తన తల్లిని తిట్టిందన్న ఆక్రోశంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే దారుణంగా చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ పంచాయతీ పరిధిలో మంగళవారం జరిగింది. కడ్తాల్ మండలం రాక్యా తండాకు చెందిన రజతి అనే యువతికి సిద్ధాపూర్ పంచాయతీ పరిధిలోని చింతగట్టు తండాకు చెందిన సుభావత్‌ లక్ష్మణ్‌తో 8నెలల క్రితం వివాహమైంది. లక్ష్మణ్ నందిగామలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. Also Read: పెళ్లయినప్పటి నుంచి రజితకు భర్త, అత్తతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తన తల్లిని భార్య అసభ్యంగా తిడుతుండటంతో లక్ష్మణ్ అనేకసార్లు వారించాడు. మంగళవారం కూడా మరోసారి అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో రజిత తన అత్తపై బూతులతో రెచ్చిపోయింది. దీంతో రెచ్చిపోయిన లక్ష్మణ్ భార్యను పుస్తెలతాడుతోనే గొంతు బిగించి చంపేశాడు. Also Read: భార్యను చంపిన తనను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో నిందితుడు పరారయ్యాడు. రజిత హత్యకు గురైందన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని లక్ష్మణ్ కోసం గాలిస్తున్నారు. క్షణికావేశంలో లక్ష్మణ్ చేసిన హత్య రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. Also Read:


By October 16, 2019 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-due-to-vulgar-comments-on-his-mother-in-rangareddy-district/articleshow/71607859.cms

No comments