Breaking News

పోలీసు అధికారి అత్యుత్సాహం.. హత్యకేసు నిందితుడితో సెల్ఫీ


హత్యకేసులో పట్టుబడిన నిందితుడి పట్ల అత్యుత్సాహం చూపించిన ఓ పోలీసు అధికారి చిక్కుల్లో పడిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పూరి జిల్లాలోని అలసాహి ప్రాతంలో ఈ నెల 5న దిలీప్ స్వైన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో రాధా మోహన్ బిశ్వాల్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడిని జీపులో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో చంద్రభాగా మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ బులు ముండా అతడితో సెల్ఫీ తీసుకున్నాడు. Also Read: ఈ ఫోటో ఎవరో సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేయడంగా వైరల్‌గా మారి పూరి జిల్లా ఎస్సీకి చేరింది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు అతడిని వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఫోటోలో బిశ్వాల్ సన్‌గ్లాసెస్‌ పెట్టుకోవడం, బేడీలు వేయకుండానే అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారంటూ ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. Also Read: బిశ్వాల్ గతంలో దిలీప్ తండ్రిని చంపి పరారయ్యాడని, ఇప్పుడు దిలీప్‌ను హత్య కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు హత్య కేసులు, నాలుగు హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ఇన్‌స్పెక్టర్ సెల్ఫీ దిగడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. Also Read:


By October 17, 2019 at 12:26PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/odisha-police-officer-bulu-munda-suspended-for-clicking-selfie-with-murder-accused/articleshow/71627474.cms

No comments