Breaking News

బాలికపై గ్యాంగ్ రేప్... విషయం తెలుసుకున్న ఆమె తల్లి ఏం చేసిందంటే?


ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఇద్దరు కామాంధులు బెదిరించి అనేకసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమెకు బాల్య వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బాలికను రక్షించి విచారించడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. పెరంబలూరు జిల్లా ఆలత్తూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తండ్రి కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తల్లి కూలిపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాలిక చదువు మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. సెప్టెంబర్ 28వ తేదీన తల్లి ఆమెకు బాల్య వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు బాల్య వివాహాన్ని ఆపి బాలిక హాస్టల్‌కు తరలించారు. అక్కడ బాలికకు విడిగా కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో ఆమె కన్నీరు పెట్టుకోవడాన్ని అధికారులు గమనించి ఆరా తీశారు. మంగూన్‌ గ్రామానికి చెందిన రంజిత్‌ (25), బాబు (23)లు తన తల్లి పనికి వెళ్లిన తర్వాత ఇంటికి వచ్చి తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ విషయం తల్లికి చెబితే వారి నుంచి కాపాడేందుకు బాల్య వివాహం నిశ్చయించిందని తెలిపింది. ఈ ఘటనపై చైల్డ్ లైన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుమార్తెపై జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టుకుండా బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నించిన బాలిక తల్లిని హెచ్చరించి పంపారు.


By October 02, 2019 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-men-arrested-for-gang-rape-on-minor-girl-in-tamilnadu/articleshow/71402927.cms

No comments