పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఎన్నారై మహిళపై అత్యాచారం

పెళ్లి పేరుతో ఎన్నారై మహిళ(38)పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 17ఏళ్లుగా లండన్లో ఉంటున్న ఓ మహిళ భర్తతో విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలతో విడిగా ఉంటోంది. 2015లో జులై నెలలో ముంబైకి వచ్చిన ఆమెకు మెడికల్ స్టోర్ యజమాని జునైద్ అన్సారీతో పరిచయమైంది. అత్యవసరంగా కావాల్సిన మందులను అతడు ప్రిస్ర్కిప్షన్ లేకుండా ఇవ్వడంతో అన్సారీపై మంచి అభిప్రాయం ఏర్పడి పరిచయం పెంచుకుంది. ఆమె లండన్ వెళ్లిపోయినా ఇద్దరూ తరుచూ ఛాటింగ్ చేసుకునేవారు. Also Read: ఈ ఏడాది జులై నెలలోమరోసారి ముంబయి వచ్చిన ఆ మహిళ అన్సారీని కలుసుకుంది. ఇద్దరూ జులై 21వ తేదీన కారులో గిర్గాం చౌపట్టి ప్రాంతానికి షికారు వెళ్లారు. అక్కడ అన్సారీ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి కారులో సెక్స్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె లండన్కు వెళ్లిపోగా.. అన్సారీ ఫోన్ చేసి నవంబర్ 12 పెళ్లి తేదీ ఫిక్స్ చేసినట్లు చెప్పాడు. మళ్లీ సెప్టెంబర్ 17న ఆమెకు ఫోన్ చేసి పెళ్లికి తన కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. Also Read: దీంతో ఆందోళన పడిన ఆమె వెంటనే ముంబైకి వచ్చి అన్సారీని నిలదీసింది. ఎక్కడైనా ఏకాంతంగా మాట్లాడుకుందామంటూ అన్సారీ ఆమెకు కారులో తీసుకెళ్లి మరోసారి కారులోనే తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. దీంతో అన్సారీ తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన మహిళ సెప్టెంబర్ 21వ తేదీన దక్షిణ ముంబైలోని గామ్దేవి పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. అన్సారీ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అన్సారీపై ఐపీసీ 376(రేప్) సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By October 02, 2019 at 09:45AM
No comments