Breaking News

Tripura:కదులుతున్న కారులో మహిళపై 9మంది గ్యాంగ్ రేప్


ఈశాన్య రాష్టమైన త్రిపురలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై 9మంది కామాంధులు కదులుతున్న వాహనంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రోడ్డు పక్కకు విసిరేసి వెళ్లిపోయారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. Also Read: రాజధాని అగర్తలాకు చెందిన ఓ మహిళ(32) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువుల బాలికను పరామర్శించేందుకు మంగళవారం వెళ్లింది. అక్కడి నుంచి రాత్రివేళ ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి ఆటో ఎక్కింది. ఆటో రూటు మారడంతో అనుమానంతో అతడిని ప్రశ్నించగా తనకు తెలిసిన వారు కొందరిని ఆటో ఎక్కించుకునేందుకు అటుగా వెళ్తున్నట్లు చెప్పాడు. కొంతదూరం వెళ్లాక నలుగురు యువకులు ఆటో ఎక్కారు. ఏదో కీడు శంకించిన ఆమె ఆటో దిగిపోతానని చెప్పడంతో వారు మహిళ నోరు నొక్కేసి బంధించారు. Also Read: తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి కొంతదూరం వెళ్లాక ఆమెను కారులోకి మార్చారు. అక్కడి నుంచి నర్సింగఢ్ అనే ప్రాంతానికి వెళ్లగా అక్కడ మరో నలుగురు కారులో ఎక్కారు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి బాధితురాలిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను వదిలేయాలని ఆమె ఎంతగా వేడుకున్నా ఆ కామాంధులు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఆమెను కారులో తిరిగి తీసుకెళ్లూ మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితురాలిని అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయారు. Also Read: బుధవారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న కొందరు మహిళలు బాధితురాలిని గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త ఈస్ట్ అగర్తలాలోని మహిళా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో తీవ్రగాయాలున్నాయని, చికిత్సకు స్పందించడం లేదని చెబుతున్నారు.


By September 27, 2019 at 11:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-gang-raped-by-9-men-in-moving-vehicle-in-tripuras-agartala-town-thrown-out/articleshow/71323787.cms

No comments