Breaking News

Hyderabad Gang Rape: బాధితురాలి శీలానికి 1.20లక్షల వెల కట్టిన పెద్దలు


గ్యాంగ్ రేప్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నిందితులను రక్షించేందుకు రంగంలోకి దిగిన కొందరు పెద్దలు బాధితురాలి శీలానికి వెల కట్టినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు పెట్టకుండా ఉంటే రూ.1.20లక్షల నగదు ఇస్తామని కొందరు మధ్యవర్తులు బాధితురాలు, ఆమె భర్తతో చర్చలు సాగించినట్లు తెలిసింది. అయితే ఈ కేసులో వేగంగా స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతో మధ్యవర్తులు కంగుతిన్నారు. Also Read: నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన గిరిజన దంపతులు నాలుగు నెలల క్రితం హర్షగూడలోని ముచ్చ ప్రశాంత్‌రెడ్డి వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో పనికి కుదిరారు. అయితే వారు తన కోళ్లను సురేశ్ అనే వ్యక్తి దొంగతనంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్న నెపంతో ప్రశాంత్‌రెడ్డి ఈ నెల 18వ తేదీన వారిని బెదిరించాడు. తాము ఏ తప్పూ చేయలేదని ఆ దంపతులు చెప్పినా వినకుండా భరత్, పవన్‌కుమార్, హనుమంతు అనే ముగ్గురు వ్యక్తుల సాయంతో భార్యభర్తలను కారులో మరో కోళ్ల ఫారానికి తీసుకెళ్లి వేర్వేరు గదుల్లో బంధించాడు. Also Read: ఆ మహిళకు పెట్టిన భోజనంతో మత్తు మందు కలిపి వారంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు దిగాక తనపై జరిగిన దారుణాన్ని తెలుసుకున్న బాధితురాలు గట్టిగా నిలదీయగా చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ భర్తను చంపేస్తామని బెదిరించారు. ఆ దంపతులతో పాటు సురేశ్ అనే వ్యక్తిని మూడురోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. చివరికి ఆ దుర్మార్గుల చెర నుంచి తప్పించుకున్న బాధితులు పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే నిందితుల తరపున మధ్యవర్తిత్వం వహించిన హర్షగూడ గ్రామ పెద్దలు రవీందర్‌, భవానీ వెంకట్‌రెడ్డి, రవినాయక్‌, చర్లపల్లి యాదయ్య, జర్పుల రాజు, బ్యాగరి సురేశ్‌, అనుగు లోకేశ్‌, విజయ్‌నాయక్‌, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి బాధిత దంపతులను కలిసి రాజీకి ప్రయత్నించారు. కేసు వెనక్కి తీసుకోవాలని సలహా ఇచ్చి బాధిత దంపతులకు రూ.1.20లక్షలు, సురేశ్‌కు రూ.1.30లక్షలు ఇచ్చారు. Also Read: ఆ డబ్బుతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితులు మధ్యవర్తులపైనా ఫిర్యాదు చేయడంతో పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఐదుగురు ప్రధాన నిందితులతో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన 8మందిని అరెస్ట్ చేసి శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వనస్థలిపురం ఏసీపీ గాంధీ తెలిపారు Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By September 29, 2019 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-gang-rape-case-police-reveals-sensational-matter/articleshow/71357016.cms

No comments