Breaking News

ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్‌ జెఠ్మలానీ కన్నుమూత


ప్రముఖ సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ (95) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వయను పైబడటంతో గత రెండు వారాల నుంచి పూర్తిగా వైద్యసాయం తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్‌పూర్‌లో 1923 సెప్టెంబరు 14న రామ్ జెఠ్మలానీ జన్మించారు. ఆయన అసలు పేరు రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ. ఆయన కుమారుడు మహేశ్ జఠ్మలానీ కూడా ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. కాగా, సుప్రీంకోర్టు, పలు రాష్ట్రాల హైకోర్టులు, దిగువ కోర్టుల్లోని కీలకమైన కేసులను విజయవంతంగా వాదించారు. ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన తొలి కేసు 1959 నాటి కేఎం నానావతి Vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసు. ఈ కేసుతో రామ్ జెఠ్మలానీ పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఆయన విజయాల పరంపర కొనసాగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడి తరఫున 2011లో మద్రాసు హైకోర్టులో వాదనలు వినిపించారు. స్టాక్ మార్కెట్ కుంభకోణం కేసులో హర్షద్ మెహతా, కేతన్ ఫరేఖ్‌‌ల తరఫున, పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు ఆఫ్జల్ గురు మరశిక్ష కేసు, జెస్సికా లాల్ హత్యకేసులో మను శర్మ ప్రతినిధిగా వాదించారు. అరుణ్‌ జైట్లీ-కేజ్రీవాల్‌ పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌ తరఫున వాదించారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయయారు. అటు రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. తొలిసారిగా ముంబై పార్లమెంటు స్థానం నుంచి తరఫున 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఇక్కడ నుంచే 1980 ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ, పట్టాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత బీజేపీతో విబేధించి పార్టీ వీడి, 2004 ఎన్నికల్లో లక్నో పార్లమెంటు స్థానం నుంచి వాజ్‌పేయి ప్రత్యర్థిగా పోటీచేశారు. తిరిగి 2010లో బీజేపీలో చేరిన ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 నవంబరులో న్యాయవాది వృత్తి నుంచి తప్పుకున్నారు.


By September 08, 2019 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/eminent-lawyer-and-former-union-minister-ram-jethmalani-passes-away/articleshow/71031610.cms

No comments