Breaking News

జీతం సరిపోక, షిఫ్టుల డ్యూటీ నచ్చక యువతి ఆత్మహత్య


పనిచేస్తున్న సంస్థలో వచ్చే జీతం ఖర్చులకు సరిపోక, ఎక్స్‌ట్రా షిఫ్టులు నచ్చక మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నార్సింగిలో ఆదివారం చోటుచేసుకుంది. Also Read: ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన నవీన(24) డిగ్రీ చదువుకుంది. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌‌కు వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది. పుప్పాలగూడలోని ఓ అపార్ట్‌మెంట్లో తన బంధువులు మెతుసలాహ్, అనన్య, స్పందనతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం మెతుసలాహ్ డ్యూటీకి వెళ్లిపోగా.. అనన్య, స్పందనతో కలిసి నవీన సరదగా గడిపింది. సాయంత్రం సమయంలో ఇద్దరు అమ్మాయిలు ఆస్పత్రికి వెళ్లగా నవీన ఒక్కతే రూమ్‌లో ఉంది. Also Read: రాత్రి సమయంలో రూమ్‌కి వచ్చిన మెతుసలాహ్ లోపల గడియ పెట్టి ఉండటంతో గట్టిగా తట్టాడు. అయినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా నవీన ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని అతడు అనన్య, స్పందనకు ఫోన్ చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నవీన మృతదేహాన్ని కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. Also Read: రూమ్‌లో ఓ చోట నవీన రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగంలో ఎంత కష్టపడినా జీతం చాలినంతగా రావడం లేదని, దీనికి తోడు షిఫ్టుల డ్యూటీతో విసిగిపోయానని, అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది. నవీన ఆత్మహత్యకు ఇవే కారణాలా లేక ఆఫీసులో ఎవరైనా వేధింపులకు పాల్పడుతున్నారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవీన ఆత్మహత్య విషయం ఆమె తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు.


By September 09, 2019 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-at-narsingi-in-hyderabad/articleshow/71042318.cms

No comments