Breaking News

ఏడేళ్లుగా సహజీవనం.. ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందని అఘాయిత్యం


ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ వేరొకరితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న వ్యక్తి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. సత్తెనపల్లికి చెందిన కాటేపల్లి రాముకు వినుకొండకు చెందిన కరణం లక్ష్మీప్రసన్నతో ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అయితే వీరిద్దరు వివాహం చేసుకోకుండానే ఐదేళ్ల పాటు తిరుపతిలో సహజీవనం చేశారు. రెండేళ్ల క్రితం చిలకలూరిపేటకు వచ్చి సుబ్బయ్యతోటలో నివాసముంటున్నారు. రాము వంటపని చేస్తుండగా, లక్ష్మీప్రసన్న స్థానిక సూపర్‌మార్కెట్లో పనిచేస్తోంది. Also Read: అయితే రాము ఇటీవల తన ప్రియురాలిపై అనుమానం పెంచుకుని వేధిస్తున్నాడు. ఆమె ఎవరితోనూ సంబంధం పెట్టుకుని తనను పక్కన పెడుతోందని అనుమానిస్తున్నాడు. ఆదివారం లక్ష్మీప్రసన్న మరొక వ్యక్తితో బైక్‌పై ఇంటికి రావడాన్ని చూసిన రాము ఆమెతో గొడవపడ్డాడు. ఆవేశంతో కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో లక్ష్మీప్రసన్న ఎడమ చేయి, నడుము, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ప్రియురాలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన రాము తానుకూడా గొంతు కోసుకున్నాడు. Also Read: ఇంట్లో నుంచి పెద్దయెత్తున కేకలు వినిపించడంతో స్థానికులు వారి ఇంటికి వచ్చి చూడగా రాము, లక్ష్మీప్రసన్న తీవ్రగాయాలతో రక్తపు మడుగులో కనిపించారు. దీంతో వారిద్దరిని 108 సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చిలకలూరిపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 09, 2019 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chilakaluripet-man-attacks-his-girl-friend-with-knife/articleshow/71043075.cms

No comments