Breaking News

దోపిడీకి గురైన రజనీకాంత్ అల్లుడు


అల్లుడు విశాకన్ వనగమూడి తన పాస్ పోర్ట్‌ను పోగొట్టుకున్నారు. భార్య సౌందర్యతో కలిసి లండన్ వెళ్లాలనుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌లో చెన్నై నుంచి లండన్ బయలుదేరారు. బిజినెస్ క్లాస్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. లండన్‌లోని హెబ్రూ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అయితే విమానం దిగగానే విశాకన్ తన సామాన్లు చూసుకుంటుండగా పాస్‌పోర్ట్ మిస్సయింది. పాస్‌పోర్ట్‌తో పాటు బ్రీఫ్‌కేస్‌లో పెట్టిన అమెరికన్ డాలర్లు కూడా మిస్సయ్యాయి. దాంతో ఆయన ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు పోగొట్టుకున్నవి దొరికే వరకు విశాకన్ దంపతులను ఓ గెస్ట్‌ రూంను కేటాయించారు. లండన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు భారత దౌత్యాధికారులకు విషయం తెలియజేయడంతో వారికి టెంపరరీ పాస్‌పోర్ట్‌ను జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. విశాకన్ పాస్‌పోర్ట్ ఉన్న బ్యాగ్‌ ఎక్కడైనా మిస్సయిందా? లేక ఎవరైనా కావాలని దొంగిలించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళ నటుడు, వ్యాపారవేత్త అయిన విశాకన్‌కు.. సౌందర్యకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అంతకుముందు విశాకన్‌కు మరో యువతితో పెళ్లై విడిపోయారు. సౌందర్య 2010లో అశ్విన్ రామ్ కుమార్ అనేే వ్యాాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడు. పేరు వేద్. కొంతకాలం తర్వాత సౌందర్య, అశ్విన్‌కు మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోవాలని అనుకున్నారు. వేద్ పుట్టిన ఏడాదికే సౌందర్య, అశ్విన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 2017లో వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత సౌందర్య.. విశాకన్‌ను వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ గురించి ముందు తన బావ మరిది, ప్రముఖ నటుడు ధనుష్‌కి చెప్పారు. తమ ప్రేమ గురించి రజనీకి చెప్పి ఒప్పించాల్సిందిగా ఇద్దరూ ధనుష్‌ని కోరారు. ఆ తర్వాత ధనుష్.. విశాకన్‌ను రజనీకి పరిచయం చేశారు. అలా కూతురి ప్రేమను అర్థంచేసుకున్న రజనీ వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి ఒక్కటి చేశారు.


By September 05, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-rajinikanth-son-in-law-vishagan-vanagamudi-gets-robbed-in-london-airport-investigation-underway/articleshow/70988350.cms

No comments