Breaking News

బస్టాండ్‌లో సాయి పల్లవి.. ఎవ్వరూ గుర్తుపట్టలేదు!


ఓ సెలబ్రిటీ కారులో ప్రయాణిస్తున్నారని తెలీగానే ఆ వాహనం వెంట పరిగెట్టే జనాలు ఎందరో ఉంటారు. అలాంటిది ఓ స్టార్ కథానాయిక బస్టాప్‌లో ఓ సాధారణ ప్రయాణికురాలిగా కూర్చు్న్నప్పటికీ ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ఈ అనుభవం ప్రముఖ నటి సాయి పల్లవికి ఎదురైంది. ప్రస్తుతం విరాట పర్వం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ వరంగల్ జిల్లాలోని పరకాల ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి బస్టాండ్‌లో ఓ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉండాలని షూటింగ్ జరుగుతోందని పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వలేదట. బస్టాప్‌‌కు దగ్గర్లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కెమెరా పెట్టి రహస్యంగా చిత్రీకరించాలని సినిమా టీం నిర్ణయించుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా సాయి పల్లవికి సాధారణ ప్రయాణికురాలిగా కనిపించేలా తయారు చేసి బస్టాప్‌లో కూర్చోమన్నారు. సాయి పల్లవి కూడా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా బస్టాప్‌లో కూర్చున్నారు. ఆమె పక్కన జనాలు కూడా ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ సాయి పల్లవిని గుర్తుపట్టకపోవడం గమనార్హం. ఆ తర్వాత సాయి పల్లవి బస్సు ఎక్కుతుండగా ఓ వ్యక్తి ఆమెను చూసి గుర్తుపట్టాడు. దాంతో ఆమె ఎవరో అక్కడున్నవారందరికీ తెలిసిపోయింది. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అంతేకాదు చిత్రీకరణ సమయంలో కొన్ని సీన్లు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. విరాట పర్వం సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రాణా దగ్గుబాటి ఇందులో కథానాయకుడిగా నటిస్తు్న్నారు. 1992లో ముగిసిన ఎమర్జెనీ పీరియడ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రజా స్వామ్యం, మార్క్‌సిజం, మానవ హక్కుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. సాయి పల్లవి సినిమాలు దాదాపుగా తెలుగు ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఫిదా’ షూటింగ్ కూడా నిజామాబాద్‌లోని బాన్సువాడ ప్రాంతంలో జరిగింది.


By September 09, 2019 at 10:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-sai-pallavi-was-seen-at-a-bus-stand-for-virata-parvam-shooting-but-no-one-recognised-her/articleshow/71043008.cms

No comments