Breaking News

సింగపూర్‌లో ఎన్నారై నిర్వాకం.. మత్తులో ఉన్న మహిళపై రేప్


మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం ప్రవాస భారతీయుడికి ఆరున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. డ్రగ్స్ అతిగా తీసుకుని మత్తులోకి జారుకున్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన అతడు కోర్టులో నేరం అంగీకరించాడు. దీంతో న్యాయమూర్తి అతడికి జైలుశిక్షతో పాటు మూడు కర్రదెబ్బలు కొట్టాలని శిక్ష విధించారు. Also Read: తిరుచెల్వమ్ మనియమ్(40) అనే ప్రవాస భారతీయుడు గతేడాది ఏప్రిల్ 20న సింగపూర్‌లోని ఓ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తు్న్నాడు. సమీపంలోని బస్టాప్‌లో ఓ జంట డ్రగ్స్ అతిగా తీసుకుని బెంచ్‌పైనే మత్తులోకి జారుకున్న సంగతి గమనించాడు. వెంటనే అతడికి పాడుబుద్ధి కలిగింది. ప్రియుడితో కలిసి ఉన్న 30ఏళ్ల మహిళను అదే బస్టాండ్ వెనక్కి లాక్కుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యలో ఆ మహిళకు మెలకువ రావడంతో గట్టిగా అరిచింది. దీంతో మనియమ్ అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: ఆ వెంటనే బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు నిందితుడిని 24గంటల్లోనే పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఏడాదికి పైగా కొనసాగిన విచారణలో మనియమ్‌ తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడికి ఆరున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడకుండా నిందితుడిని మూడు కర్రదెబ్బలు కొట్టాలని ఆదేశించింది. దీంతో పోలీసులు మనియమ్‌ను కోర్టులోనే కర్రతో మూడు దెబ్బలు కొట్టారు. అనంతరం అతడిని జైలుకు తరలించారు. Also Read:


By September 06, 2019 at 12:42PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/indian-origin-man-gets-6-5yr-jail-for-rape-on-woman-in-singapore/articleshow/71006185.cms

No comments