Breaking News

ఇద్దరితో మహిళ అక్రమ సంబంధం... గొంతు నులిచి చంపేసిన మొదటి ప్రియుడు


తనతో పాటు మరొక వ్యక్తితో పెట్టుకుందన్న ఆక్రోశంతో ఓ వ్యక్తి ప్రియురాలిని గొంతు నులిమి చంపేశాడు. ఈ నెల 11వ తేదీన శివారు నాగారం పశ్చిమ గాంధీనగర్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన కేసును కీసర పోలీసులు చేధించారు. ఆమె మొదటి ప్రియుడే హంతకుడని నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. Also Read: మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ(35) భర్తతో గొడవపడి కుమార్తెతో సహా కొద్దికాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన చంద్రయ్య, రామకృష్ణ అనే వ్యక్తులతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఒకరికి తెలియకుండా ఒకరితో ఆమె రాసలీలలు కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల చంద్రయ్యకు విషయం తెలియడంతో ప్రియురాలిని నిలదీశాడు. రామకృష్ణతో సంబంధ మానుకుని తనతోనే ఉండాలని కోరాడు. Also Read: అయినప్పటికీ ఆమె పట్టించుకోకుండా చంద్రయ్య ఎదుటే రామకృష్ణతో చనువుగా ఉండేది. దీంతో కక్ష పెంచుకున్న చంద్రయ్య ఈ నెల 11వ తేదీన ఆమెకు మద్యం తాగించి గొంతు నులిచి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని నాగారం పరిసరాల్లో పడేసి వెళ్లిపోయాడు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు ఆచూకీ కోసం సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. నాచారం మల్లాపూర్‌లో నివసించే ఆమె కుమార్తె ఈ విషయం తెలుసుకుని మృతురాలు తన తల్లేనని చెప్పింది. తన తల్లి అక్రమ సంబంధాల గురించి కూడా ఆమె చెప్పడంతో పోలీసులు చంద్రయ్య, రామకృష్ణను ప్రశ్నించారు. ఆమెను తానే హత్య చేసినట్లు చంద్రయ్య ఒప్పుకోవడంతో పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By September 17, 2019 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-woman-murdered-by-her-lover-arrested/articleshow/71160559.cms

No comments