Breaking News

ఆన్‌లైన్ రమ్మీతో రూ.38కోట్లు హాంఫట్... అప్పులు తీర్చేందుకు సొంత బ్యాంకుకే కన్నం


అతడు ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి. కష్టపడి పనిచేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగాడు. దీంతో అందరూ అతడి ఎదుగుదలను చూసి గర్వపడ్డారు. అయితే ఆన్‌లైన్ రమ్మీ(పేకాట)కి బానిసైన అతడు తక్కువ సమయంలోనే ఆస్తులన్నీ పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. దీంతో సొంత బ్యాంకుకే కన్నమేసి దొంగగా మారాడు. వ్యసనాలకు బానిసైతే జీవితం ఎలా దిగజారిపోతుందో అన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన అశ్విని జుంజువాలా అనే వ్యక్తి గోల్డెన్ స్యాచ్స్ సర్వీస్ అనే ఓ ప్రైవేటు బ్యాంకులో ఉన్నతోద్యోగి. చిన్నస్థాయి నుంచి ఎదిగిన అతడు.. నాలుగేళ్ల క్రితం ఆ సంస్థకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ పొందాడు. సంస్థ ఎదుగుదలకు ఎంతగానో శ్రమించే జుంజువాలా అంటే అందరికీ అభిమానం. ఇటీవల ఆన్‌లైన్ రమ్మీకి అలవాటు పడి జుంజువాలా దానికి బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే రూ.కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నాడు. వాటిని తీర్చేందుకు అందినచోటల్లా అప్పులు తీసుకున్నాడు. ఆ డబ్బులను కూడా రమ్మీలోనే బెట్టింగ్‌ బెట్టి కోల్పోయాడు. తీసుకున్న అప్పులు తీర్చకపోవడంతో రుణదాతల నుంచి అతడికి ఒత్తిడి మొదలైంది. దీంతో అప్పుల బాధ నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించుకుని సొంత బ్యాంకుకే కన్నమేసేందుకు ప్లాన్ వేశాడు. అప్పటికే సంస్థలో మోసానికి పాల్పడిన వేదాంత్ అనే యువకుడి సాయంతో బ్యాంక్ మెయిన్ అకౌంట్‌కు లాగిన్ అయి తన అకౌంట్‌కు రూ.38కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అశ్విని జుంజువాలా, వేదాంత్ పరారయ్యారు. వారిద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


By September 11, 2019 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-bank-employee-addicts-to-online-rummy-theft-rs-38crore-in-his-own-bank/articleshow/71075781.cms

No comments