Breaking News

పండ్ల వ్యాపారి అఘాయిత్యం.. 12ఏళ్ల బాలికకు 8నెలల గర్భం


గుజరాత్‌లోని నగరంలో పండ్ల వ్యాపారి నీచానికి పాల్పడ్డాడు. 12ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలల క్రితం జరిగిన బాధితురాలు గర్భం దాల్చడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. Also Read: సూరత్‌కు చెందిన 12ఏళ్ల బాలిక ఇటీవల తరుచూ అనారోగ్యానికి గురికావడంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె శరీరంలో మార్పులు కనిపించడంతో డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేయగా బాలిక 8నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. ఏం జరిగిందని కుమార్తెను నిలదీయగా షాకిచ్చే విషయం చెప్పింది. Also Read: బాలిక స్కూల్‌కి వెళ్లొచ్చే క్రమంలో ఓ పండ్ల వ్యాపారితో పరిచయం ఏర్పడింది. ఆమెకు రోజూ ఉచితంగా కొన్ని పండ్లు ఇస్తూ ఆ వ్యాపారి ఆమెను మచ్చిక చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం పండ్ల తోటలు చూపిస్తానని చెప్పి బాలికను నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి రిక్షాలో ఇంటి దగ్గర దించాడు. తనపై జరిగిన అత్యాచారం గురించి బాలిక పేరెంట్స్‌కు చెప్పలేదు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటకు వచ్చింది. Also Read: ఈ ఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి తల్లిదండ్రులకు ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదన్న అనుమానం పోలీసులకు కలుగుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అతడు బెదిరించాడా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. Also Read:


By September 09, 2019 at 12:43PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/surat-fruit-seller-raped-12-year-old-girl-8-months-ago/articleshow/71044791.cms

No comments