Breaking News

Chandrababu Naidu పాలనపై స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు


సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వామి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు నెలల 20 రోజుల పాటూ చతుర్మాత దీక్షకు వెళుతున్నట్లు స్వరూపానందేంద్ర తెలిపారు. 18 ఏళ్లుగా లోక కళ్యాణార్థం శారదాపీఠం తరపున దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు శారదా పీఠాధిపతి గత ప్రభుత్వం నదీ హారతులు, పుష్కరాలు, ఇతర పథకాల పేరుతో ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చు చేసిందని స్వరూపానంద విమర్శించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని.. అలాగే ప్రజా ధనం దుర్వినియోగం చేయడంపై విచారణ జరపించాలని.. విశాఖ శారదా పీఠం తరపున త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విజ్ఞ‌ప్తి చేస్తామని స్వరూపానందేంద్ర తెలిపారు. స్వరూపానందేంద్ర గతంలోనూ చంద్రబాబు పాలన పై విమర్శలు చేశారు. ఆలయాలు, అర్చకుల్ని నిర్లక్ష్యం చేస్తునన్నారని.. టీటీడీ విషయంలోనూ ప్రభుత్వం తీరు సరిగా లేదంటూ ఆరోపించారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీడీడీ వ్యవహారంలో.. అర్చకుల రిటైర్మెంట్‌ను వర్తింప చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.


By July 03, 2019 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/swami-swaroopanandendra-saraswati-sensational-comments-on-privies-government-rule/articleshow/70052929.cms

No comments