Breaking News

కుప్పం పర్యటనకు బాబు.. బ్యానర్ల ఏర్పాటుపై టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ


అధినేత, మాజీ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బాబుకు కుప్పం పర్యటనకు వస్తున్నారు. మంగళ, బుధవారాలు ఆయన నియోజకవర్గంలో ఉంటారు. అధినేత పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణకు దారితీసింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. మాజీ సీఎం చంద్రబాబు పర్యటనకు స్వాగతం పలుకుతూ సోమవారం రాత్రి శాంతిపురం మండల కేంద్రంలో బ్యానర్లను కట్టారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హాయంలో జరిగిన ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలు, వివరాలతో కూడిన డిజిటల్‌ బ్యానర్లు, ఫ్లెక్సీలను కుప్పం- పలమనేరు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. అయితే, వీటిని సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఉన్న బ్యానర్ల ముందు కట్టారు. దీన్ని గుర్తించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు మూడు గంటల పాటు జాతీయ రహదారిపై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం కొనసాగింది. దీనిపై సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు, రామకుప్పం, గుడుపల్లె పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై వారిని చెదరగొట్టి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.తమ బ్యానర్లకు అడ్డుగా ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్లను తొలగించాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. Read Also: చంద్రబాబు పర్యటన ముగిసిన అనంతరం బ్యానర్లను స్వచ్ఛందంగా తొలగిస్తామని, అంతవరకు ఉంచాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. బ్యానర్లను తొలగించాల్సిందేనని వైసీపీ, తొలగించేది లేదని టీడీపీ భీష్మించుకొని కూర్చున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలను పోలీసులు పిలిపించారు. పోలీసుల మాటలను ఎవరూ వినకపోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.


By July 02, 2019 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/flexi-fight-between-ysrcp-and-tdp-at-kuppam-due-to-chandrababu-visit/articleshow/70034998.cms

No comments