Breaking News

గర్భం దాల్చిన ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థినులు


ప్రభుత్వం నడిపిస్తోన్న హాస్టళ్లలో నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చిన ఘటనలు ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో బాలికల వసతి గృహాలు నిర్వహిస్తున్నారరు. వీటిలోని రెండు హాస్టళ్లలో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) నుంచి తమకు నివేదిక అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనూప్ సాహూ వెల్లడించారు. విద్యార్థినులు వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లి ప్రస్తుతం స్కూళ్లు తెరవడంతో తిరిగి వచ్చారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు హాస్టళ్లలోని నలుగురు విద్యార్థినులు గర్భవతులని తేలిందని సాహూ తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినులు గర్భం దాల్చుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఖుర్దా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ బాలల ఆరోగ్య పథకం(ఎన్‌సీహెచ్‌సీ) ఆధ్వర్యంలోని సంచార వైద్య పరీక్షల బృందం వేసవి సెలవుల తర్వాత తిరిగి వసతిగృహాల్లో చేరిన పలువురు విద్యార్థినులకు వివిధ పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో భువనేశ్వర్‌లోని రెండు వసతిగృహాల్లోని నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఆ నివేదిక అందుకున్న సీడబ్ల్యూసీ ప్రతినిధులు పోలీసు కమిషనర్‌ సత్యజిత్‌ మహంతికి ఫిర్యాదు చేశారు.


By July 02, 2019 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/girl-students-found-pregnant-at-government-run-hostels-in-odisha/articleshow/70035165.cms

No comments