'తానా సభలా, టీడీపీ భజన సభలా.. అమెరికాలో పరువు తీశారు'

అమెరికాలో తానా సభలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎన్ఆర్ఐలతో పాటూ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సభల్లో సందడి చేశారు. ఇక పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు తరలి వెళ్లారు. అయితే తానా సభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ప్రసంగాన్ని కొందరు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. రాం మాదవ్ ప్రసంగాన్ని అడ్డుకోవడం వెనుక హస్తముందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ నేతలపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్పందించారు. తానా సభలో రాం మాధవ్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై కన్నా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కన్నా తన ట్వీట్లో ‘అవి'తానాసభలు' కాదు 'టీడీపీ భజనసభలు'.. పచ్చతమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువాళ్ళ ప్రతిష్ట దిగజారుస్తున్నారు. రాంమాధవ్ గారిని ఆహ్వానించి ఆయన జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించి లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారు. ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అంటూ మండిపడ్డారు.
By July 08, 2019 at 12:42PM
No comments