Breaking News

పార్లమెంటులో వైఎస్ విగ్రహం ప్రతిష్ఠించండి.. ఎంపీ బాలాశౌరీ లేఖ


ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌‌ ఓం బిర్లాకు లేఖ రాసిన మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి.. వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన రూపాయికే వైద్య సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పోలవరం, పులిచింతల ప్రాజెక్ట్‌లతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని బాలాశౌరి తన లేఖలో పేర్కొన్నారు. వైఎస్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్టించి ఆయనను గౌరవించాలని స్పీకర్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని స్పష్టం చేశారు. జులై 8న వైఎస్ జయంతికి కానుకగా స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని బాలశౌరి విన్నవించారు. కాగా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకులకు కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్‌ కమిషనర్‌ వీఎస్‌ సంపత్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నిబద్ధత, అంకితభావానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మారుపేరని కొనియాడారు. ఆరోగ్యశ్రీ సేవలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ను ప్రజా నాయకుడిగా అభివర్ణించారు. వైఎస్‌ జయంతిని పురస్కరించుకొని ఏపీభవన్‌ ఆడిటోరియంలో ‘యాత్ర’ చలనచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. అనంతరం ఇడుపులపాయలో పర్యటించి, గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు.


By July 08, 2019 at 12:24PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ycp-mp-bala-souri-wrote-a-letter-to-lok-sabha-speaker-for-set-up-ysr-statue-in-parliament/articleshow/70124515.cms

No comments