Breaking News

ఓ మాజీ సర్పంచ్‌కు ఫోన్ చేసి కీలక బాధ్యత అప్పగించిన కేసీఆర్!


ముఖ్యమంత్రి ఓ సాధారణ వ్యక్తికి ఫోన్‌ చేసి మాట్లాడటం చాలా అరుదుగా జరగుతుంది. అయితే, తెలంగాణ సీఎ మాత్రం గతంలో ఆదిలాబాద్‌ జిల్లా రైతు శరత్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. తాజాగా సిద్ధిపేట జిల్లాలోని ఓ మాజీ సర్పంచ్‌కు ఆదివారం ఫోన్ చేశారు. రాజధానికి కొత్త రహదారి నిర్మాణం విషయమై ములుగు మండలం క్షీరసాగర్‌ మాజీ సర్పంచికి ఫోన్‌ చేయడం విశేషం. జిల్లాలోని జగదేవపూర్‌, మర్కూక్‌ మండలాల ప్రజలు హైదరాబాద్‌ త్వరగా చేరుకోడానికి దగ్గర దారి నిర్మించాలని కేసీఆర్ భావించారు. రాజీవ్‌ రహదారిలో ఉన్న ఒంటిమామిడి నుంచి మర్కూక్‌ మండలం పాండురంగ ఆశ్రమం వరకు రెండు వరసల రోడ్డు నిర్మాణం చేయాలని సంకల్పించారు. అయితే, ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ఆయా గ్రామాల రైతులు ఇస్తారా? లేదా? అనే విషయమై క్షీరసాగర్‌ మాజీ సర్పంచి వెంకటేశ్‌ గౌడ్‌‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం మర్కూక్‌, జగదేవపూర్‌ మండలాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ రావాలంటే గౌరారం, ములుగు నుంచి రాజీవ్‌ రహదారి మీదుగా చేరుకుంటున్నారు. ఇది ఆ ప్రాంతాల వారికి చాలా దూరం అవుతుంది. దీనిని తగ్గించి ప్రత్యామ్నాయంగా రహదారి నిర్మించాలని సీఎం భావించారు. ఒంటిమామిడి నుంచి క్షీరసాగర్‌, కమలాబాద్‌, నర్సంపల్లి, అలియాబాద్‌, అల్లీనగర్‌ మీదుగా పాండురంగ ఆశ్రమం వరకు రహదారి నిర్మించాలని అనుకుంటున్నట్లు వెంకటేశ్‌గౌడ్‌తో చెప్పారు. రెండు వరుసల రోడ్డు నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, తొందరగా హైదరాబాద్‌ చేరుకోవచ్చని అన్నారు. Read Also: అంతేకాదు, ఆయా గ్రామాల రైతుల భూములకు కూడా విలువ పెరుగుతుందని కేసీఆర్ తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, భూములు ఇచ్చేలా రైతులను ఒప్పించాలని మాజీ సర్పంచికి సీఎం కేసీఆర్ సూచించారు. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆయనతో ముచ్చటించారు. తాను రైతులతో మాట్లాడి విషయం చెబుతానని వెంకటేశ్ గౌడ్ బుదలిచ్చారు.


By July 01, 2019 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-call-to-ksheerasagar-village-ex-sarpanch-for-new-road-to-hyderabad/articleshow/70018715.cms

No comments