Breaking News

లోయలో పడిన మినీబస్సు.. 25 మంది దుర్మరణం


జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు మలుపు తీసుకుంటున్న సమయంలో అదుపుతప్పి లోయపడిపోయింది. ఈ ఘటనలో 25 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మినీ బస్సు సోమవారం ఉదయం కేశవాన్ నుంచి సుమారు 40 మందితో కిష్టావర్ ప్రాంతానికి బయలుదేరింది. ఎత్తైన కొండల మధ్య ప్రమాదరకంగా సాగే ఈ ప్రయాణంలో ఉదయం 7.50గంటల సమయంలో సిర్‌గ్వారి ప్రాంతంలో బస్సు మలుపు తీసుకుంటుండగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కిష్టావర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిష్టావర్ పట్ణణం జమ్మూకి 230కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మృతదేహాలను మార్చురీకి తరలించామని, మృతులను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.


By July 01, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/25-killed-13-injured-after-mini-bus-falls-into-deep-gorge-in-jammu-and-kashmir/articleshow/70019042.cms

No comments