Breaking News

కరీంనగర్ కార్పొరేషన్ మరో వినూత్న పథకం.. రూపాయికే అన్ని మెడికల్ టెస్ట్‌లు!


అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్ పేరిటి దేశంలోనే తొలిసారిగా ఒక్క రూపాయికే అంత్యక్రియల పథకాన్ని ప్రవేశపెట్టిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు జరిపించడానికి ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూపాయికే అంత్యక్రియలు పథకం ప్రారంభించింది. ఈ పథకంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తాయి. తాజాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కరీంనగర్ తెలిపారు. పేదలకు భారం లేకుండా నగరపాలక సంస్థ అధ్వర్యంలో ఈ పథకం ప్రారంభిస్తామని అన్నారు. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా పలు నగరాలు కొత్త కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నాయని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా కేఎంసీ కూడా కొత్త పథకాలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే రూపాయికే అంత్యక్రియల పథకం అమలవుతోందని, కేటీఆర్ సూచనతో తాజా పథకానికి ముందడుగు వేశామని అన్నారు. రూపాయికే రక్త, మూత్ర, బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహిస్తామని మేయర్ తెలియజేశారు. దీని కోసం ల్యాబొరేటరీ, పరికరాల కొనుగోలుకు రూ.25 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో హెల్త్ సెంటర్, హెల్త్ ఆఫీసర్‌ను నియమించిన వెంటనే అమల్లోకి తీసుకురానున్నట్టు వివరించారు. పేదల కోసం బూట్ హౌజ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వినియోగించకుండా ఉన్న చెప్పులను ఈ కేంద్రంలో ఇస్తే వాటిని నిరుపేదలకు అందజేస్తామని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, రూపాయికే అంత్యక్రియల పథకం జూన్ 15న ప్రారంభమైంది. నగర పరిధిలోని ప్రజలు రూపాయి చెల్లిస్తే నగరపాలక సంస్థ తరఫున అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందు కోసం నగరపాలక సంస్థ రూ.1.50 కోట్లు కేటాయించి, ప్రత్యేకంగా రెండు వ్యాన్లు, ఫ్రీజర్, ఇతర సామగ్రి కొనుగోలు చేసింది. ఈ పథకం జూన్ 15న ప్రారంభం కాగా, మేయర్ రవీందర్ సింగ్ ఓ నిరుపేద మహిళ పాడి మోశారు. ఏవరైనా చనిపోతే వారి గురించి బల్దియాకు సమాచారం అందించి రూపాయి చెల్లిస్తే ప్రత్యేక సిబ్బంది ఇంటికి వెళ్లి దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతిమయాత్రకు వాహనం, బాడీ ఫ్రీజర్‌, చితికి ఉచితంగా కట్టెలు, కిరోసిన్‌ అందజేస్తారు. ఖననం చేస్తే గుంతను తవ్విస్తారు. అలాగే అంత్యక్రియల రోజున 50 మందికి రూ.5కే భోజన సదుపాయం కల్పిస్తారు.


By July 01, 2019 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/karimnagar-municipal-corporation-will-conducts-all-medical-tests-at-one-rupee/articleshow/70019116.cms

No comments