Breaking News

Odisha: పదో తరగతి విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్


మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఓ వైపు దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కామాంధుల ఆరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. నిత్యం ఏదో చోట మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస అత్యాచార ఘటనలతో తెలుగు రాష్ట్రాలు బెంబేలెత్తిపోతుండగా పక్క రాష్ట్రం ఒడిశాలో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా జోడా ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్తోంది. ఓ ప్రాంతంలో బాలికను గమనించి ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించి నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. అరిస్తే చంపేస్తామని బెదిరించి బాలికపై ఐదురుగు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి అఘాయిత్యాన్ని తట్టుకోలేని బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆ యువకుడు ఓ మైదానం ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో పడివున్న బాలికను మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గమనించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.


By June 26, 2019 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/10th-class-girl-raped-on-way-to-home-in-odisha-5-arrested/articleshow/69951859.cms

No comments