Breaking News

చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గింపు


ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి సర్కార్ భద్రత తగ్గించింది. జడ్ కేటగిరి ఉన్న బాబు తనయుడు లోకేష్ సెక్యూరిటీని 2+2 గన్‌మెన్లకు తగ్గించారు. ఇక చంద్రబాబు, లోకేష్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. గతంలో జెడ్ కేటగిరీలో లోకేష్‌కు 5+5 సెక్యూరిటీ ఉండేది. విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు కుటుంబం మంగళవారమే హైదరాబాద్ చేరుకుంది. ఈలోపే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా.. సెక్యూరిటీని ఎలా తగ్గిస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం భద్రత విషయంలో రాజీపడలేదని గుర్తు చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో కూడా భద్రతను పెంచారే కానీ తగ్గించలేదంటున్నారు. ఇదంతా కక్షసాధింపు చర్యలని నేతలు మండిపడుతున్నారు.


By June 25, 2019 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-government-cuts-security-for-ex-cm-chandrababu-naidu-family/articleshow/69938764.cms

No comments