Breaking News

పోలవరం అంచనాలకు కేంద్రం ఆమోదం.. వైసీపీ, బీజేపీలకు లోకేశ్ సూటి ప్రశ్న!


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ముగియలేదు. గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తాము మాత్రం పారదర్శక పాలన అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్నారు. అమరావతి వేదికగా సాగుతోన్న కలెక్టర్ల సదస్సులోనూ ప్రజావేదిక నిర్మాణంపై కూడా సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఇవన్నీ ఆరోపణనలేనని, తమపై బురదజల్లడానికే ఇలా వైసీపీ ప్రచారం చేస్తోందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. తమపై కక్ష సాధింపు చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందని ధ్వజమెత్తుతోంది. ఈ సమయంలో సవరించిన అంచనాలకు కేంద్ర ఆమోదం తెలపడంతో ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీడీపీపై బురద జల్లేందుకే బీజేపీ, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు కేంద్రం ఆమోదించినట్టు సాక్షి చేసిన ట్వీట్లను లోకేశ్ షేర్ చేశారు.‘తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రూ. 55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది?’ అని ప్రశ్నించారు. ‘అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైసీపీ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. అవినీతికి తావులేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం చంద్రబాబుగారు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు’ అని మరో ట్వీట్ చేశారు. ‘ఇప్పటికైనా బీజేపీ, వైసీపీ నాయకులు టీడీపీ మీద బురదజల్లడం మాని, మిగిలిన 30 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెడితే మంచిది’ అని మరో ట్వీట్‌లో సలహా ఇచ్చారు. లోకేశ్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఎప్పుడో ఫిబ్రవరిలో ఆమోదించిన దీనిని సాక్షి అదేదో ఇవ్వాళ జగన్ గారిని చూసి ఆమోదించినట్లే చెబుతుంది. మొన్నటి వరకు చంద్రబాబు 16 వేల కోట్లు నుంచి 55 వేల కోట్లకు అంచనాలు పెంచింది అవినీతి కోసమే అని విమర్శించిన వైసీపీ ఇప్పుడు ఏమి సమాధానం చెప్తుంది. ఈ అవినీతి లేదు అనే కదా కేంద్రం ఆమోదించింది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి:


By June 25, 2019 at 12:38PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-leader-nara-lokesh-slams-ysrcp-due-to-allegations-on-polavaram-estimations/articleshow/69939376.cms

No comments