Breaking News

సూర్యాపేట: ఆటోను ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి


ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను లారీ ఢీకొట్టడం వల్ల చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం చింతపల్లికి చెందిన ఓ కుటుంబం సూర్యాపేట జిల్లా జాంపహాడ్‌ దర్గాను దర్శించుకోడానికి శుక్రవారం ఉదయం ఆటోలో బయలుదేరింది. కుటుంబంలోని మొత్తం ఎనిమిది మంది దర్గాకు చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అదే ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తోన్న ఆటో చిల్కూరు మిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు రాగానే ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంలో గాయపడినవారిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారైనట్టు తెలిపారు. అతడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వివరించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. దైవదర్శనం చేసుకుని తిరుగుప్రయాణమైన వారిని మృత్యువు వెంటాడం కంటతడి పెట్టిస్తోంది.


By June 21, 2019 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/lorry-hits-auto-at-chilkur-in-suryapet-district-in-telangana/articleshow/69885767.cms

No comments