Breaking News

ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం.. ఎల్లుండి నుంచి కూల్చేస్తాం: జగన్


ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తోన్న సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు సాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సదస్సులో ముందుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమావేశం ఉద్దేశాల్ని వివరించారు. అనంతరం రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. అవినీతి, దోపిడీని తమ ప్రభుత్వం ఎంత మాత్రం సహించదని, ఎమ్మెల్యేలు, అధికారులు తమకు రెండు కళ్లు అని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి అర్హుడికి అందాలని అన్నారు. ఇందు కోసం గ్రామ సచివాలయం, వలంటీర్లు ముఖ్య పాత్ర పోషించబోతున్నారని సీఎం పేర్కొన్నారు. ఒకవేళ వలంటీర్లు అవినీతికి పాల్పడితే సీఎంవోకి సమాచారం అందజేయవచ్చని, వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినవారిపై విచారణ జరిపి తొలగించి కొత్తవారిని నియమిస్తామని జగన్ హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకూ ఎక్కడా అవినీతి ఉండరాదని అన్నారు. కాంట్రాక్ట్ అంటే అవినీతి అనే స్థాయికి తీసుకొచ్చారని, ఇందులో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిటీ అడిగామని తెలిపారు. ఎందులోనైనా అవినీతి జరిగినట్టు రుజువైతే వాటిని రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోడ్ చేసిన వారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని, అవినీతి, అక్రమ సంపాదనతో ఈ నిర్మాణం జరిగిందని అన్నారు. అక్రమంగా నిర్మించిన వేదికలో సమావేశం పెట్టే దుస్థితి ఏర్పడిందన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చూపాలనే ఉద్దేశంతో ఇందులో కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని, ఎల్లుండి నుంచి దీనిని కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.


By June 24, 2019 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cm-jagan-sensational-decision-on-praja-vedika-hall/articleshow/69922914.cms

No comments