Breaking News

అర గంటలో మూడు భూకంపాలు.. భయంతో వణికిపోయిన రాజస్థాన్ ప్రజలు


ఉత్తరాదిని రెండు వారాల నుంచి వరుణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో అనేక రాష్ట్రాల్లో రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడి గ్రామాలను భూస్థాపితం చేస్తున్నాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీ నగరం పది రోజుల నుంచి ముంపులోనే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున వరుసగా మూడు భూకంపాలు సంభవించడం గమనార్హం. ఇవన్నీ కేవలం 30 నిమిషాల్లోనే చోటుచేసుకున్నాయి.

By July 21, 2023 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-earthquakes-jolt-rajasthan-capital-jaipur-in-span-of-half-an-hour/articleshow/102004110.cms

No comments