Breaking News

కేదార్‌నాథ్‌లో ఫోటోలు, వీడియోలపై నిషేధం.. ఆలయ కమిటీ హెచ్చరికలు


ఆలయంలో పూజలు జరుగుతుండుగా.. పురోహితులు వేద మంత్రాలను పఠిస్తున్నారు. ఆ సమయంలో గర్భగుడిలోకి వెళ్లిన ఓ మహిళ.. శివలింగానికి పక్కనే నిలబడి అనంతరం అక్కడ ఉన్న కేదారీశ్వరుడిపై కరెన్సీ నోట్లను చల్లింది. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న వారు ఫొటోలు, వీడియోలు తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

By July 18, 2023 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/photography-and-videography-banned-inside-kedarnath-temple-says-bktc/articleshow/101841462.cms

No comments