Breaking News

ఫైఓవర్‌పై 160 కి.మీ. వేగంతో జనాలపైకి దూసుకెళ్లిన జాగ్వార్ కారు.. 9 మంది మృతి


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇస్కాన్‌ వంతెనపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట ప్రాంతంలో ఓ ట్రక్కు.. కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంతో అక్కడ ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో అతివేగంతో వచ్చిన ఓ జాగ్వార్‌ కారు.. వారిని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పోలీసు కానిస్టేబుల్‌తో సహా 9 మంది దుర్మరణం చెందారు.

By July 20, 2023 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nine-killed-as-speeding-jaguar-rams-into-crowd-in-ahmedabad-iskon-flyover-of-gujarat/articleshow/101976156.cms

No comments