Breaking News

నందిని Vs అమూల్‌గా మారిన కర్ణాటక ఎన్నికలు.. ఇరకాటంలో బీజేపీ


కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అమూల్ ఎంట్రీతో దుమారం రేగుతోంది. వేసవి కావడంతో నందినిపాలు, పెరుగు, నెయ్యి కొంతమేరా తగ్గడంతో ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్న తరుణంలో అమూల్‌ను బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి తీసుకొచ్చిందని కర్ణాటకలో విపక్షాలు విమర్శిస్తున్నాయి. కర్ణాటకలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కూడా నందిని అగ్రస్థాయి పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో నందిని ఉత్పత్తులనిుంటినీ తప్పనిసరిగా కాపాడతామని సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం ప్రకటించారు.

By April 09, 2023 at 11:47AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/karnataka/news/opposition-targets-bjp-over-amul-products-entry-in-karnataka/articleshow/99353500.cms

No comments