Breaking News

Joe Biden: సెప్టెంబరులో భారత్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు


Joe Biden జీ-20 కూటమికి ఈ ఏడాది భారత్ నాయకత్వం వహిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి నేతల సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్‌లో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై అధ్యక్షుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డోనాల్డ్‌ లూ వెల్లడించారు. భారత్‌-అమెరికా సంబంధాల్లో 2023 చాలా ముఖ్యమైనదిగా బైడెన్‌ భావిస్తున్నారని పేర్కొన్నారు.

By April 23, 2023 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-joe-biden-to-visit-india-in-september-says-us-official/articleshow/99700368.cms

No comments