Breaking News

ఎర్రబస్సులో మాదిరిగా విమానం గాల్లో ఉండగానే ప్రయాణికులు సిగపట్లు.. పగిలిన కిటికీ


ప్రయాణికుల మధ్య గొడవ కారణంగా ఓ విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రయాణికుల కొట్లాటలో విమానం కిటికీ ఒకటి బద్దలు కాగా.. కొన్ని వస్తువులు విరిగిపడ్డాయి. దీంతో దగ్గర్లోని విమానాశ్రయంలో విమానం దింపాల్సి వచ్చిందని పైలట్ చెప్పారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వీన్స్ లాండ్ నుంచి నార్తర్న్ టెరిటరీలోని డార్విన్‌కు వెళుతున్న విమానంలో ప్రయాణికులు నలుగురు గొడవపడినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

By April 27, 2023 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/flight-makes-emergency-landing-after-fighting-breaks-out-mid-air-in-australia/articleshow/99802893.cms

No comments