Breaking News

అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం.. యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నాలు: అమెరికా కీలక తీర్మానం


భారత్, చైనాల మధ్య దాదాపు మూడేళ్లుగా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గాల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చే ప్రయత్నాలను సైన్యం అడ్డుకోవడంతో డ్రాగన్ మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న మెక్‌మహన్ రేఖను చైనా, భారత్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా అమెరికా గుర్తించింది. అరుణాచల్‌ను తమ భూభాగమని చైనా చేస్తోన్న వాదనలను ఈ తీర్మానం వ్యతిరేకించింది.

By March 15, 2023 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/arunachal-pradesh-integral-part-of-india-and-china-trying-to-change-status-quo-says-us-resolution/articleshow/98649213.cms

No comments