Breaking News

అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ.. ‘వీరసింహారెడ్డి’ షో మధ్యలోనే ఆపేసిన యాజమాన్యం


నందమూరి బాలకృష్ణ (Balakrishna) గత చిత్రం ‘అఖండ’ విడుదలైనప్పుడు అమెరికాలోని కొన్ని థియేటర్లలో సౌండ్ ఎక్కువ పెట్టమని.. బాక్సులు పగిలిపోతున్నాయని యాజమాన్యాలు నోటీస్ బోర్డులు పెట్టాయి. ఇప్పుడు ఏకంగా థియేటర్‌లో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) షోను మధ్యలో ఆపేసి ప్రేక్షకులంతా మర్యాదగా బయటకు వెళ్లిపోవాలని థియేటర్ యాజమాన్యం కోరింది. అంటే, థియేటర్‌లో బాలకృష్ణ అభిమానులు ఏ స్థాయిలో రచ్చ చేశారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు వచ్చి అందరూ థియేటర్‌లో నుంచి వెళ్లిపోవాలని కోరుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

By January 12, 2023 at 11:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/balakrishna-veera-simha-reddy-show-stopped-in-middle-and-audiences-were-told-to-leave-theatre-in-usa/articleshow/96930502.cms

No comments