Breaking News

Free Ration దేశంలోని 81 కోట్ల మంది పేదలకు లబ్ది కలిగే కీలక నిర్ణయం తీసుకున్న మోదీ


Free Ration ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల వరకు అందజేయనున్నారు. 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .తర్వాత దీనిని క్రమంగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో ఏడాదికి ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించింది

By December 24, 2022 at 07:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/free-ration-to-poor-under-nfsa-scheme-extended-by-one-year-says-union-government/articleshow/96468840.cms

No comments