Breaking News

Assam Meghalaya Border కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. పెట్రోల్ బంకుల్లో కిలోమీటర్ల కొద్దీ క్యూ


Assam Meghalaya Border మంగళవారం తెల్లవారుజామున కలపను అక్రమంగా తరలిస్తున్నారనే కారణంతో మేఘాలయ సరిహద్దుల్లో ఓ ట్రక్కును అసోం అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలై హింసకు దారితీసింది. ఈ ఘటనలో ఒక అసోం అటవీ శాఖ అధికారి, ఐదుగురు మేఘాలయవాసులు సహా ఆరుగురు మృతిచెందారు. ఇరు రాష్ట్రాలూ దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తమ భూభాగంలోనే ట్రక్కును అడ్డుకున్నామని అసోం పోలీసులు అంటే... తమ రాష్ట్రంలోని ప్రవేశించి కాల్పులు జరిపారని మేఘాలయ ప్రత్యారోపణలు చేసింది.

By November 25, 2022 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-petroleum-workers-union-stops-fuel-supply-to-meghalaya-due-to-violence/articleshow/95751389.cms

No comments