Breaking News

మళ్లీ విజృంభిస్తున్న మీజిల్స్.. 13 మంది మృతి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఈ వైరస్ లక్షణాలివే


Measles outbreak in Mumbai: మీజిల్స్ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. 20 ఏళ్లుగా నియంత్రణలో ఉన్న ఈ వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముంబై నగరంలో నెల రోజుల వ్యవధిలోనే ఈ వైరస్ కారణంగా 13 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ నగరంలో ఏకంగా 233 మీజిల్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన కొన్నేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రతో పాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లోనూ మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి.

By November 24, 2022 at 01:38PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/measles-outbreak-in-mumbai-13-children-died-so-far-in-maharashtra-all-you-need-to-know/articleshow/95735532.cms

No comments