వందే భారత్ రైలు.. విమానం లాంటి ఎక్స్పీరియన్స్, ప్రత్యేకతలివే
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
దేశంలో మూడో వందే భారత్ రైలును (Vande Bharat Train) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శుక్రవారం (సెప్టెంబర్ 30) ఉదయం గాంధీనగర్ - ముంబై మార్గంలో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించిన మోదీ.. ఆ తర్వాత రైలెక్కి అందులోని వసతులను పరిశీలించారు. అనంతరం రైల్లో కొంతదూరం ప్రయాణించారు. అహ్మదాబాద్లోని కాల్పుర్ రైల్వే స్టేషన్ వరకు ఈ రైలులో ప్రధాని ప్రయాణించారు. మోదీతో పాటు రైల్వే సిబ్బంది కుటుంబాలు, కొంత మంది మహిళా వ్యాపారవేత్తలు, యువత ఈ రైల్లో ప్రయాణించారు. మోదీ వారిని ఆప్యాయంగా పలుకరించి ముచ్చటించారు. ప్రధానితో కలిసి వారంతా ఫొటోలు తీసుకున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి అనుభూతిని ఇవ్వనుంది. వందే భారత్ రైలు ప్రత్యేకతలు..
By September 30, 2022 at 10:53PM
By September 30, 2022 at 10:53PM
No comments