Breaking News

బెంగళూరులో వరద కష్టాలు.. ట్రాక్టర్లతో ఆఫీసులకు టెక్కీలు.. వీడీయోలు వైరల్


ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమయ్యింది. నగరంలోని పలు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. రోడ్లలపై వర్షం నీరు నిలిచిపోవడంతో కాల్వలను తలపిస్తున్నాయి. దీంతో పడవలు, బోట్లపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకుంది. అలాగే, ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు అధికారులు తరలించారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిస్తాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీచేయడంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

By September 06, 2022 at 12:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/techies-ride-tractors-to-office-due-to-floods-in-bengaluru/articleshow/94022207.cms

No comments